క్షమించు గణనాథా

◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు
◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.
◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..
కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం లో భాగంగా ఎల్ఎల్సీ కాలువలో వీటిని అర్ధరాత్రి ఎంతోమంది అధికారుల మధ్య నిమజ్జనం ఏర్పాటు చేశారు, ఆ రహదారి ఆదోని నుండి బాంబే హైవే కావడంతో ఎంతోమంది గణనాథ విగ్రహాలు ఇలా పడి ఉండడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వీడియో

పెద్ద హరివాణం గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారీ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని ప్రముఖులు, మేధావులు, చెబుతూనే ఉన్నారు. అయితే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇలాంటి అవగాహన కల్పించకుండా పోవడం వల్ల భారీ వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసి నిమజ్జనం చేయడం వల్ల ఇలా పర్యావరణానికి హాని కలుగుతుందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కనిపిస్తూ ఉందని ప్రజలు, భక్తులు చెబుతున్నారు. ఒక అడుగు నుంచి మూడు అడుగుల మట్టి వినాయకులైతే నీళ్లలో నిమజ్జనం చేసిన వెంటనే కరిగిపోతాయని దీనిపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో నీరు కలిసితం కాకుండా, ఎవరికి గాని హాని ఉండదని తెలిపారు.. ప్లాస్టర్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమై తాగే పశువులకు, మనుషులకు, పంటలకు ఎంతో హాని కలిగి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరారు.

కాలువలో తేలి ఉన్న గణనాథులు
కాలువలో తేలి ఉన్న గణనాథులు
చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు
కాలువలో తేలి ఉన్న గణనాథులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version