కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28, 2023న ప్రారంభించబోతున్నరు.
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీ నా ప్రారంభించడాని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది .
రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు అని న్యాయవాది సీఆర్ జయ సుకిన్ పిటిషన్‌లో ప్రశ్నించారు. 19 ప్రతిపక్ష పార్టీలు మే 28న ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ చేసిన ప్రకటనలను సుప్రీంకోర్టుకు పిటిషన్ లో తెలిపారు. వారు రాష్ట్రపతిని పక్కన పెట్టారని, దీనిని “అవమానం”గా పేర్కొంటూ బహిరంగంగా ఆరోపించారు అని అన్నారు.
“రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు మరియు పార్లమెంటు సంస్థకు అధిపతి. ఆర్టికల్ 85 ప్రకారం, రాష్ట్రపతి ప్రతి పార్లమెంటు సభను సమావేశానికి పిలిపించవచ్చు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
“ రాష్ట్రపతి ప్రధానిని నియమిస్తారు” అని ఎత్తి చూపుతూ, గవర్నర్లు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ మొదలైన రాజ్యాంగపరమైన అధికారులను రాష్ట్రపతి నియమిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.
దేశంలో అత్యున్నత శాసన సభ అయిన పార్లమెంటు ప్రారంభోత్సవం రాష్ట్రపతి లేకుండా “చట్టం ప్రకారం కాదు” అని సుకిన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version