కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. ఆ రైతును అడిగి వివరాలు తెలుసుకొన్నారు రైతు రామాంజనేయులు మాట్లాడుతూ ఒకసారి ఎకరా పొలం తడపాలంటే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఏడెకరాలకు ఒకసారి 2 లక్షల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. సిపిఎం రాష్ట్ర […]