- ఒక్క అవకాశం కోసం… తెర్నేకల్లు సురేందర్ రెడ్డి
- దశాబ్దకాలంగా ఎదురుచూపులు
- పార్టీ స్థాపితం నుండి పార్టీ జెండా మోసినా జరగని న్యాయం
- ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులు
- కుడా చైర్మన్ పదవి ఖరారైనా దక్కని అవకాశం
- 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ కోసం ప్రయత్నాల్లో తెర్నేకల్లు సురేందర్ రెడ్డి
ఆలూరు ప్రత్యేక ప్రతినిధి : కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో వైకాపాలో ఆసక్తికర రాజకీయ చదరంగాలు బయట పడుతున్నాయి… దశాబ్దకాలంగా ఎదురుచూపులు చూస్తున్న తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ జెండా మోసినా జరగని న్యాయం అని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు, ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులను జయించి ఈ సరైన 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ సురేందర్ రెడ్డికి దక్కేనా.. ? అని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే ప్రయత్నంలో వైకాపా అధిష్టానం ఉన్నట్లు జోరుగా జిల్లాలో ప్రచారం సాగుతున్నది, దీనితో ఆ నియోజకవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు టికెట్ కోసం ముమ్మార ప్రయత్నాలు సాగిస్తున్నారు, దేవనకొండ మండలానికి చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఇటీవలే టిడిపిని వదిలి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు అయితే కొంతమంది వైకాపా పెద్దలు ఆలూరు టికెట్ తనకు ఇప్పిస్తామనె హామీతో పార్టీలో తను చేరినట్లు నియోజక వర్గంలో ప్రచారం జరుగుతున్నది, వీరితోపాటు చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు బలంగా ప్రచారంలో ఉంది, మంత్రి జయరాంతో ఆయనకు ఉన్న విభేదాలతో ఇటీవలనే పార్టీ వీడే ఆలోచనలో ఉన్న విరుపాక్షిని కొంతమంది వైకాపా పెద్దలు సర్దిచెప్పి పార్టీలో కొనసాగితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లు సమాచారం, దీంతో ఆయన ఎలాగైనా పోటీచేయాలనే ఆలోచనతో కొంతమంది వైకాపా ముఖ్య నేతలతో టికెట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది, మాజీ ఎమ్మెల్యే తెర్నేకల్లు నీరజా రెడ్డి కుమార్తె హిమ వర్షిత రెడ్డి కూడా వైకాపా తరపున పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే స్థానిక వైకాపా నేతలు టిడిపికి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి స్థానిక నేత అయితే బాగుంటుందనె ఆలోచనతో వైకాపా రాష్ట్ర సీనియర్ నాయకులు తెర్నేకల్ సురేందర్ రెడ్డిని పోటీలో నిలబెడితే గెలుపుకు సులభంగా ఉంటుందనె ఆలోచనతో రెడ్డి సామజికవర్గానికి చెందినా పెద్దలు అనుకుంటునట్లు తెలుస్తుంది, స్థానిక వ్యక్తి కావడం, అలాగే జే.సి.యస్ కర్నూల్ జిల్లా కో ఆర్డినేటర్ గా ముఖ్య పదవిలో ఉండటం వల్ల పార్టీ క్యాడర్ కు అనుకూలంగా విజయానికి కూడా సులువు అవుతుందని తెర్నేకల్ సురేందర్ రెడ్డి అయితేనే సరైన అభ్యర్థి అనే ఆలోచనతో స్థానిక వైకపా నేతలు నియోజక వర్గ ముఖ్య నాయకులతో జోరుగా మంతనాలు కొనసాగిస్తున్నారు, సురేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా తిరుగుతూ పార్టీ నాయకులను కలుస్తూ వాళ్లకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నారు, నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులు వైసిపి అధిష్టానంలో ఉన్న ముఖ్య నాయకులతో బేటి అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది, తెర్నేకల్ సురేందర్ రెడ్డికి పార్టీ టికెట్ కోసం స్థానిక నేతలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కప్పట్రాల వెంకటప్ప నాయుడుకి దేవనకొండ మండలంలో ప్రత్యేక వర్గం ఉన్నప్పటికీ వారంతా టిడిపిలో పాతుకొని పోవడం బొజ్జమ్మ వైకాపాలో చేరిన కూడా తన వెంట ఎవ్వరు రాకపోవడంతో ఒకవేల టికెట్ ఇచ్చిన గెలుపుకు కష్టతరం అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు, అంతే కాకుండా తన ప్రత్యర్థి అయిన మద్దిలేటి నాయుడు అదే పార్టీలోనే ఉన్నారు, బొజ్జమ్మ కు టికెట్ ఇస్తే ఎంతవరకు సహకరిస్తారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు, బొజ్జమ్మకు ఆలూరు నియోజకవర్గం లో సరైన మద్దతు లేనట్లు కనిపిస్తుంది, మంత్రి సామాజిక వర్గానికి చెందిన చిప్పగిరి జడ్పీటిసి విరుపాక్షి కి టికెట్ ఇచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం ఎంతవరకు సహకరిస్తారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షి మంత్రి గుమ్మనూరుకు తీవ్రస్థాయిలో విభేదాలు ఉండడంతో గుమ్మనూరు జయరాం వర్గం అందుకు వ్యతిరేకంగా పనిచేయదా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, ఇక మాజీ ఎమ్మెల్యే నీరజ రెడ్డి కుమార్తె హిమ వర్షిత రెడ్డి కి ఇప్పటి వరకు ఆలూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి, ప్రజలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఇప్పుడు వచ్చి ఓటు వేయమని అడిగితే ప్రజలు సహకరిస్తారా అని ఓటర్లు గుసగుసలాడుతున్నారు, వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గట్టి పోటీగా తెర్నేకల్ సురేందర్ రెడ్డిని పోటీలో నిలబెట్టినట్లయితే ఆలూరు లో మరోసారి వైకాపా జెండా ఎగరవేయగలమని స్థానిక ముఖ్య నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతూ… తన సామాజిక వర్గానికి చేసిందేమి లేదని అందువల్లనే తన సామాజిక వర్గతో పాటు ఇతర బి.సి వర్గానికి చెందినా వారు కూడా ఇప్పుడు సహకరిస్తారో…? లేదో….? అనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదే తరుణంలో టిడిపి తరఫున రెడ్డి సామాజిక వర్గనికి చెందిన కోట్ల సుజాతమ్మ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది, వైకాపాలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపితే గెలుపు సులభమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు