కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..

■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.
■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే..

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి కార్మికులకు రావాల్సిన బకాల కంటే అధికంగా వచ్చేలా కార్మికులకు న్యాయం చేశారు. 772 మంది కార్మికులకు కోతారీ మిల్లు నుండి దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రతి కార్మికుడికి సుమారు1,16,580/౼ రూపాయల చెప్పును ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. మొదటి చెక్కు కౌడేల్ పేటకు చెందిన వలీ భాష అనారోగ్యంతో ఉన్నారని తెలిసి వారింటికి వెళ్లి చెక్కులు అందజేశారు. అనంతరం మిగిలిన కార్మికులకు ఎమ్మెల్యే తన ఇంటి వద్ద చెక్కులను అందజేశారు. కార్మికుడు చనిపోయిన ఎడల వారి కుటుంబాలకు అందజేస్తామని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా 20 సంవత్సరాల వరకు పోరాటం చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక సంఘాలకు కార్మిక సంఘా నాయకులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదారిమి యజమాని ప్రణీత పార్ట్నర్ వీర రాఘవ రెడ్డి, అడ్వకేట్ జీవన్ సింగ్ వైసిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కార్మిక సంఘ నాయకులు అజయ్ బాబు మరియు కార్మిక సంఘం నాయకులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version