డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే పై ఘాటుగా స్పందించారు హైలెట్ కావడానికి ఇలా చేస్తూ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్లు పరిగెత్తి వెళ్లడం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి అంటే గాడిద పాలు తాగడం, దోషాలు వేయడం కాదని మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని మైనారిటీ ఐటిఐ కాలేజ్, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ పనులు పూర్తిచేసి సిబ్బంది తప్పిస్తే అది అభివృద్ధి అన్నారు. ఏమి చేతకాక చర్చలకు వస్తానని మాట్లాడడం సరైన పద్ధతి కాదని తెలిపారు.
ఈ ర్యాలీలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు దేవా మహిళా నాయకులు మైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.