ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం

​ఆదోని నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని R&B గెస్ట్‌హౌస్‌లో దళిత ప్రజా సంఘాల నాయకులతో కలసి బాధితుడు, దానాపురం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

అవమానకర వ్యాఖ్యలు 2025 జూన్ 16న గ్రామంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రథమ పౌరుడైన తనను ‘ఎస్సీ’ అని కులం పేరుతో సంబోధించి, తీవ్రంగా అవమానించారని మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ వాపోయారు. ఏడాది కాలంగా రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదులు చేసినా, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై ఒక్కరోజులోనే కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు.. అధికార కూటమి నాయకులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దళితులను అవమానించిన కూటమి నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

Back To Top
Exit mobile version