తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కుటుంబ సభ్యులను విచారిచాగా సుమారు 14 సం.ల నుండి ఆదోని టౌన్ లోని చందా సాబ్ దర్గా ఇనాం స్తలమ్ లో షెడ్ వేసుకోసి అందులో సప్లయర్ షాప్ మరియు జిరాక్స్ షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడని షాప్ ప్రక్కలో స్వంత ఖర్చులతో ఇంకొక షెడ్ కట్టించి దాన్నిని ఎరువుల అంగిడ్ వాళ్లకు ఇచ్చినాడని, అలాగే ఒక స్సం., క్రితం అదే దర్ఘ స్తలంలో ఉన్న ఒక హోటల్ ను తమిళనాడు వాళ్ళ నుండి 8 లక్షలకు కొనగా అపుడు దర్గా వాల్లు ఎలా కొంటావని, ఒక లక్ష ఇచ్చి ఖాలీ చేయించి నారని, అలాగే సుమారు 8 నెలల నుండి రాము నుండి బాడిగ తీసుకోకుండా రాము ఉన్న షాప్ ఖాలీ చేయాలనీ ఒత్తిడి చేసినారని , అందుకు రాము అతని కుటుంబ సబ్యులు ఎంత వేడుకున్నా వాళ్లు వినలేదని పోలీసులకు బంధువులు తెలిపారు. మరల రాము షాప్ వద్దకు వచ్చిఖాలీ చేయండి లేకపోతే ఎక్కడికైనా పోయి చావండి అని చెప్పినారని, అందుకు రాము మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోన్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదోని రైల్వే SI రామస్వామి దర్యాప్తు చేసి section 306 r/w 34 IPC గా మార్చి సదరు దర్గా హక్కు దారులైన పాన్ షాప్ సలాం , చోటు @ సలీం లపై కేసు నమోదు చేశారు.