Day: August 27, 2025

పాము కాటుకు మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో పాము కాటుకు మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.. ఉదయం పత్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్ళిన మంగమ్మ కు పాము కరిచిందని వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంగమ్మ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలపడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 27 08 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయలు

Back To Top
Exit mobile version