Month: July 2024

గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవలి

మొహరం పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. ఎస్ఐ చిన్న పిరయ్యకర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ పరిధిలోని గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కులామతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది మొదటి పండుగ అని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను హెచ్చరించారు.

మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి

మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నరు అంగన్వాడి ఆశా వర్కర్లు.. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంత సబ్ కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-07-24 పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7136/- రూపాయలు కనిష్ట ధర ₹. 4390/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5645/- రూపాయలు కనిష్ట ధర ₹.5560/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 3539/- రూపాయలు కనిష్ట ధర ₹. 2239/- […]

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 10.07.2024

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1602.67 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 25.173 టీఎంసీలు

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య..

ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు లెక్చరర్గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకుని.. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.

ఎస్.ఎల్.బి.సి మీటింగ్లో 5 లక్షల 40 వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) సమావేశం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసిన SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ). 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక.వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం. అంటే గతం కంటే 14 శాతం అధికంగా […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-07-24 పత్తి అత్యధికంగా ₹. 7692/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5629/- రూపాయలు కనిష్ట ధర ₹. 4316/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

ఆదోనిలో అర్ధరాత్రి ఇంట్లోలో చోరీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావిలో సెంట్రింగ్ మేస్త్రి రామాంజనేయులు ఇంట్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు. సుమారు 4 తులాల బంగారు, 36 తులాల వెండి, 15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు అక్కడ చేరుకొని దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లడంతో నిఘా వేసిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.

Back To Top
Exit mobile version