News
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.
ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.
100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలు
శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)
ఉదయం
8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.
10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.
11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.40 – సంతజూటూరులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.15 – పరమటూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.10 – బండిఆత్మకూరులో స్థానికులతో మాటామంతీ.
6.35 – బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రంలో బస.
News
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
ఆదోని నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని R&B గెస్ట్హౌస్లో దళిత ప్రజా సంఘాల నాయకులతో కలసి బాధితుడు, దానాపురం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
అవమానకర వ్యాఖ్యలు 2025 జూన్ 16న గ్రామంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రథమ పౌరుడైన తనను ‘ఎస్సీ’ అని కులం పేరుతో సంబోధించి, తీవ్రంగా అవమానించారని మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ వాపోయారు. ఏడాది కాలంగా రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదులు చేసినా, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై ఒక్కరోజులోనే కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు.. అధికార కూటమి నాయకులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దళితులను అవమానించిన కూటమి నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.
News
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాల నిషేధం దుర్మార్గం: PDSU ఖండన
సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు […]
సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ వద్ద PDSU ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విద్యార్థులు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు అఖండ, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ. ■ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం: అధికారంలోకి రాకముందు రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ■సమస్యల నిలయాలుగా హాస్టళ్లు: విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాహారం అందించాలని కోరారు. ■ పోరాటాలకు సిద్ధం: గతంలో పేద విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా సాగనంపారో, హామీలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ■ పోస్టుల భర్తీ: హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల నాయకులు రసూల్, బసవ, పవన్, విష్ణుముని, హుసేని, వంశీ, శశిధర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు..
News
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది.. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
ఆదోని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ఆదోనిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ◆ ఉద్యోగాల మోసం: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో మరియు స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చి పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెడుతున్నారని […]
ఆదోని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ఆదోనిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ◆ ఉద్యోగాల మోసం: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో మరియు స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చి పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ◆ హామీల అమలు ఏది?: ‘సూపర్ సిక్స్’ పథకాలను అరకొరగా అమలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని, మహిళలకు ఇచ్చిన ₹1,500 హామీ, 50 ఏళ్లకే పింఛన్ హామీల ఊసేత్తడం లేదని విమర్శించారు. ◆ శాంతిభద్రతల క్షీణత: ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాన్ని టీడీపీ గుండాలు పెకిలించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ఇలాంటి హింసాత్మక చర్యల వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తూ సోమవారం ఆదోనిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దీక్షా పరులు చలపతి, తాయన్న, జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బి.దేవా, నాయకులు ఫయాజ్, రహింసాబ్, రామలింగేశ్వర యాదవ్, నల్లారెడ్డి మరియు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
News4 weeks ago
ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News4 weeks ago
కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News4 weeks ago
ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News3 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు