కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్ళు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే 11 12 13 తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం పెద్ద తుంబలం గ్రామం నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు […]
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కళ్లితండాలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయము అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఈ దేశం మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు అన్నారు.
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ.
ఆదోని 11 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/18 /- రూపాయలు, రిటైల్: 1kg 14/20 /- రూపాయలు